ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం భద్రతా ఏర్పాట్లు, హెలిప్యాడ్ మరియు సభా ప్రాంగణాన్ని స్వయంగా పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.










