మంగళగిరిలో ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టీ-20 టోర్నమెంట్ వైభవంగా ప్రారంభమైంది. హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా క్రీడలను ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 జట్లు పాల్గొంటున్న ఈ పోటీలు ఈ నెల 24 వరకు మూలపాడు స్టేడియంలో జరగనున్నాయి.
పోలీసులు నిత్యం విధుల్లో బిజీగా ఉన్నా, క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. త్వరలో మహిళా పోలీసులకు కూడా ప్రత్యేక స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.










