విజయవాడ దుర్గగుడికి వచ్చే భక్తుల పట్ల క్షేత్రస్థాయి సిబ్బంది, కాంట్రాక్టర్లు మర్యాదగా ప్రవర్తించాలని ఈవో శీనా నాయక్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.
కొబ్బరికాయలు, క్లోక్ రూమ్, పార్కింగ్ వద్ద అదనపు వసూళ్లు లేదా దురుసు ప్రవర్తన వల్ల ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందని మండిపడ్డారు.
తీరు మారని కాంట్రాక్టర్ల లైసెన్స్లు రద్దు చేయడంతో పాటు డిపాజిట్లు జప్తు చేస్తామని హెచ్చరించారు.










