మదనపల్లెలో నకిలీ ఇళ్ల పట్టాలతో జరుగుతున్న అక్రమ కట్టడాలపై తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
2014 నుంచి మంజూరైన పట్టాల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి, నకిలీ పట్టాలను గుర్తించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి త్వరితగతిన నివేదిక సమర్పించాలని సూచించారు.
ప్రభుత్వ భూములను ఆక్రమించినా, నకిలీ పత్రాలు సృష్టించినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.









