విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో సోమవారం కేంద్ర మాజీ మంత్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
టీడీపి నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బడుగు, బలహీన వర్గాల కోసం ఎర్రన్నాయుడు చేసిన పోరాటం మరువలేనిదని, జాతీయ స్థాయిలో తెలుగువారి ఖ్యాతిని పెంచిన ఆయన స్ఫూర్తితో ప్రజా సేవలో ముందుంటామని నేతలు ఈ సందర్భంగా ప్రతినబూనారు.










