ఏపీలోని వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ, ఫిషరీస్ వర్సిటీల ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచకపోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది.
ఉన్నత విద్యాశాఖ పరిధిలోని వారికి పెంచి, వీరికి పెంచకపోవడం వివక్ష చూపడమేనని జస్టిస్ బట్టు దేవానంద్ ధర్మాసనం పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పిటిషనర్లను సర్వీసులో కొనసాగించాలని ఆదేశిస్తూ, ఫిబ్రవరి 15న ప్రభుత్వం ఇచ్చిన ప్రతికూల ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.









