హిందూ స్మశాన వాటికలో చెత్త డంపింగ్ నిలిపివేయండి.|

0
1

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  మచ్చ బొల్లారం పరిధిలోని సర్వే నెంబర్ 199లో హిందూ శ్మశానవాటిక స్థలంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న చెత్త ట్రాన్సఫర్ స్టేషన్ ని వెంటనే నిలిపివేసి మరో చోటకి తరలించాలని శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజిగిరి మున్సిపల్ కమీషనర్ విజయ్ కృష్ణ రెడ్డిని మచ్చబొల్లారం జాయింట్ యాక్షన్ కమిటీ కలిసి వినతి పత్రం అందజేశారు.

దాదాపు తొమ్మిది దశాబ్దాల క్రితం ఒక దాత దాతృత్వంతో ఏర్పాటు అయ్యిన మచ్చ బొల్లారం స్మశానవాటికను ప్రభుత్వం డంపింగ్ యార్డుగా మార్చింది..

అని జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం స్మశానవాటిక స్థలంలో డంపింగ్ నిలిపివేయాలి అని ఆదేశాల జారీ చేసి దాదాపు మూడు వారాలు గడుస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

కమిషనర్  వెంటనే ఒక నిర్ణయం తీసుకొని స్మశానవాటికలో చెత్త డంపింగ్ నిలిపివేయాలి అని జేఏసి అధ్యక్షులు ఉదయ్ ప్రకాష్ కోరారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు డోలి రమేష్, జేఏసి నాయకులు సుధాకర్ పడల, మెట్టు రాజశేఖర్, ప్రవీణ్, పుష్ప, పవన్ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju
Alwal