నిజామాబాద్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో సీపీ కల్మేశ్వర్ సింగన్వార్ (సాయిచైతన్య) ప్రజల నుండి 30 ఫిర్యాదులను స్వీకరించారు.
బాధితుల సమస్యలను నేరుగా విని, సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సోమవారం జరిగే ఈ కార్యక్రమం ద్వారా సామాన్యుల సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని సీపీ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.








