మదనపల్లి అభివృద్ధిపై సీఎంతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా చర్చలు

0
0

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు.

ఈ భేటీలో నియోజకవర్గ అభివృద్ధిపై కీలక చర్చలు జరిపారు. ముఖ్యంగా మదనపల్లి పట్టణంలోని ప్రధాన సీటీఎం (CTM) రోడ్డు విస్తరణ ఆవశ్యకతను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఎమ్మెల్యే విన్నపాలకు సానుకూలంగా స్పందించిన సీఎం, అభివృద్ధి పనులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.