తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అసెంబ్లీలో కీలక వివరాలు వెల్లడించారు.
2014 నుండి పక్కాగా ఉన్న ఈ-టెండర్ల వ్యవస్థను గత ప్రభుత్వం 2020లో కేవలం ఐదు నెలల వ్యవధిలోనే మార్చేసిందని విమర్శించారు. భోలేబాబా, వైష్ణవి వంటి అనుభవం లేని సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే నాణ్యత ప్రమాణాలను తగ్గించి, శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని ఆనం ఆరోపించారు.










