ఈనెల 25న ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మన్నె రవీంద్ర అధికారులను ఆదేశించారు.
సోమవారం వెలుగొండ గెస్ట్ హౌస్లో అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలిప్యాడ్ నిర్మాణం, ఫీడర్ కెనాల్ శంకుస్థాపన పనులు, గంటావానిపల్లె బ్రిడ్జి విస్తరణ మరియు బీటీ రోడ్డు పనులను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.










