బాపట్ల మండలం అప్పికట్ల రహదారిలోని నాగరాజు కాలువలో ఈతకు దిగి ప్రమాదవశాత్తు గల్లంతైన యువకులు పీటా లీలా వంశీకృష్ణ, యాటగిరి చందు మృతదేహాలను మంగళవారం వెలికితీశారు.
అగ్నిమాపక అధికారి జి. రామ సిద్ధార్థ ఆధ్వర్యంలో గజఈతగాళ్లు, రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనపై బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
#Narendra
