2026-27 విద్యా సంవత్సరానికి గాను సోంపేట మండలం రాజపురంలోని ఏపీ మోడల్ స్కూల్లో 6వ తరగతిలో చేరాలనుకునే విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.www.cse.ap.gov.in /www.apms.apcfss.in ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు రుసుము ఓసి బిసి లకు 200/ ఎస్సి, ఎస్టీ లకు 125 రూపాయలు.
ఆర్హత పొందిన విద్యార్థులకు మోడల్ స్కూల్ రాజపురం లో తేది 12-04-2026 ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పరీక్ష నిర్వహించబడును. మరిన్ని వివరాలకు ఎపి మోడల్ స్కూల్ రాజపురం ప్రిన్సిపాల్ ను సంప్రదించాలని కోరారు.










