ఖమ్మం జిల్లాలో పేదల ఇళ్ల కూల్చివేత వెనుక జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల హస్తం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
అక్రమ సంపాదన కోసమే భూదాన్ భూములపై కన్నేశారని, పేదలకు ఇళ్లు కట్టించాల్సింది పోయి కూల్చడమేనా ఇందిరమ్మ రాజ్యం? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్లో ఇప్పుడు ఉన్నవారంతా డూప్లికేట్ గాంధీలని ఎద్దేవా చేసిన ఆయన, తమ ప్రభుత్వం వచ్చాక అదే స్థలంలో పేదలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
