మత్తు పదార్థాల వాడకం జీవితాలను నాశనం చేస్తుందని విశాఖ జిల్లా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం గంజాయి, డ్రగ్స్ మాత్రమే కాకుండా అతిగా మద్యం, నికోటిన్ మరియు నొప్పి నివారణ మందుల వాడకం కూడా వ్యసనంగా మారుతుందని వారు స్పష్టం చేశారు.
వీటివల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, గుండెపోటు, కాలేయం మరియు మూత్రపిండాలు దెబ్బతినడం వంటి ప్రాణాంతక సమస్యలు వస్తాయని, బాధితులను సరైన కౌన్సెలింగ్తో సాధారణ జీవితంలోకి తీసుకురావచ్చని తెలిపారు.
