మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దాదాపు రెండేళ్ల తర్వాత సీబీఐ అధికారులు విచారణను మళ్ళీ ప్రారంభించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం (ఫిబ్రవరి 28) సీబీఐ బృందం పులివెందుల పోలీసు స్టేషన్కు చేరుకుని రికార్డులను పరిశీలించింది.
హత్యకు ముందు జరిగినట్లుగా భావిస్తున్న వాట్సాప్ కాల్స్ మరియు టెక్నికల్ డేటా ఆధారంగా ఈ దర్యాప్తు సాగుతోంది. ఇప్పటికే నిందితులుగా ఉన్న వారి బంధువులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
