కర్నూలు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో కశ్మీరీ విద్యార్థినులపై వివక్ష, వేధింపులు జరుగుతున్నాయని జమ్మూ కశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (JKSA) సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది.
హిజాబ్పై ఆంక్షలు విధించడమే కాకుండా, విద్యార్థినులను ‘ఉగ్రవాదులు’ అని దూషిస్తున్నారని ఆరోపించింది. రంజాన్ ఏర్పాట్ల విషయంలోనూ యాజమాన్యం వేధిస్తోందని.
సుమారు 24 మంది విద్యార్థినులు భయాందోళనలో ఉన్నారని పేర్కొంది. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
