తిరుమల లడ్డూ వివాదం: శాసనమండలిలో ఎమ్మెల్సీల నిరసన హోరు.

0
0

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా మండిపడ్డారు.

శుక్రవారం శాసనమండలిలో ఇతర ఎమ్మెల్సీలతో కలిసి చైర్మన్ పోడియం వద్ద ఆయన నిరసన చేపట్టారు.

పవిత్రమైన ప్రసాదంపై లేనిపోని ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, ఇందుకు ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ వివాదంపై నిజానిజాలు బయటపెట్టాలని ఆయన స్పష్టం చేశారు.