Home South Zone Telangana పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

0

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక వరమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
హనుమాన్ నగర్‌కు చెందిన పద్మజ అనే మహిళ అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం నుండి మంజూరైన రూ. 1,25,000 విలువైన CMRF (LOC) చెక్కును ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం లబ్ధిదారురాలికి అందజేశారు.
బోయిన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా తమ కార్యాలయం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా చెక్కు అందుకున్న పద్మజ కుటుంబ సభ్యులు తమకు అండగా నిలిచిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్, బిఆర్ఎస్ (BRS) నాయకులు విజయ్ శేఖర్, మోసిన్, నరప్ప మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

#sidhumaroju
Alwal

NO COMMENTS

Exit mobile version