అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కలెక్టరేట్కు వచ్చే బాధితులను పోలీసులు అడ్డుకోవడాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి పి. శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు.
శుక్రవారం సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన కార్మికులను, ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుని పంపించివేయడం అన్యాయమని మండిపడ్డారు.
మదనపల్లె జిల్లా కేంద్రం ప్రాధాన్యత పెరిగిన తరుణంలో పోలీసుల తీరు దారుణంగా ఉందని, ధర్నాలకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు.










