విజయనగరం జిల్లా బొబ్బిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మినుములు, పెసల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు.
మార్కెట్ ధర కంటే మద్దతు ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాల మేరకు పంటను తీసుకువచ్చి, దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. ఈ కేంద్రం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా, త్వరితగతిన చెల్లింపులు జరుగుతాయని వెల్లడించారు.
#Boiena Rajesh










