చనిపోయినా.. మరో ఇద్దరికి చూపు అయ్యాడు

0
0

తాను మరణించినా అతని కళ్లు మాత్రం ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. రాజాం లచ్చయ్య పేటకు చెందిన అల్లాడ సూర్యారావు (70) శనివారం మృతి చెందారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విజ్ఞప్తి మేరకు కుటుంబ సభ్యులు సూర్యారావు నేత్రాలను దానం చేశారు. టెక్నిషియన్ రమణ నేత్రాలను సేకరించి విజయనగరం తరలించారు.

వీటితో మరో ఇద్దరికి చూపును ఇస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను అభినందించారు.

#Boiena Rajesh