వేట్లపాలెం బాణసంచా ప్రమాదంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (సౌత్ ఇండియా) జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి, క్షతగాత్రులకు రూ. 50 లక్షల చొప్పున భారీ పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాయవరం ఘటన మరవకముందే ఈ దుర్ఘటన జరగడం అధికారుల వైఫల్యమేనని విమర్శించారు. ప్రమాదానికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధ్యులైన రెవెన్యూ, ఫైర్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన స్పష్టం చేశారు.
