విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం జిల్లా వాసి మృతి చెందాడు. గజపతినగరం మండలం బంగారమ్మపేట గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ ఉద్యోగి గోపాలరావు కొంత కాలంగా విశాఖలో నివాసం ఉంటున్నారు.
BHV సమీపంలో గోపాలరావు ప్రయాణిస్తున్న స్కూటీని GVMC లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
#Boiena Rajesh










