హైదరాబాద్: తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
ఏఐసీసీ (AICC) వెల్లడించిన వివరాల ప్రకారం, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మరియు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది.
నామినేషన్ల దాఖలుకు నిర్ణీత గడువు ఉండటంతో, అభ్యర్థులు ఇద్దరూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.
జాతీయ రాజకీయాల్లో సింఘ్వీకున్న అనుభవం, చట్టసభల్లో ఆయన గొంతుక పార్టీకి అవసరమని భావించిన హైకమాండ్, ఆయనకు అవకాశం కల్పించింది. మరోవైపు, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన వేం నరేందర్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి ప్రతిపాదన మేరకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
తమను రాజ్యసభ అభ్యర్తులుగా ఎంపిక చేసినందుకు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు వేం నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం దృష్ట్యా ఈ ఇద్దరు అభ్యర్థుల విజయం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
#sidhumaroju
Alwal
Home South Zone Telangana తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు- బరిలో అభిషేక్ సింఘ్వీ , వేం నరేందర్ రెడ్డి .|










