విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో రెంటపల్లి శ్యామ్ను టీఎన్టీయూసీ నేతలు ఘనంగా సన్మానించారు. ఏపీ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్గా ఆయన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కష్టపడి పనిచేసే కార్యకర్తలను టీడీపీ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని పాల మాధవ్ కొనియాడారు. కార్మికుల సంక్షేమం కోసం మరింత ఉత్సాహంతో పనిచేస్తానని ఈ సందర్భంగా శ్యామ్ హామీ ఇచ్చారు.










