Home South Zone Andhra Pradesh గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం.. మరొకరికి గాయాలు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు దుర్మరణం.. మరొకరికి గాయాలు.

0

మార్కాపురం జిల్లా.
పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఘటనడోన్ సమీపంలోని రాచర్ల గ్రామానికి చెందిన బెస్త శరత్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ఉన్న నూనె దేవేంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

మాచర్ల నుండి డోన్ లో జరిగే రంగనాథ స్వామి జాతరకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పెద్ద దోర్నాల ఎస్సై ఎస్. వెంకట రమణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

NO COMMENTS

Exit mobile version