తెలంగాణ నూతన గవర్నర్ గా శివ ప్రసాద్ శుక్లా.|

0
0

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
గత ఏడాది కాలంగా తెలంగాణ గవర్నర్‌గా సేవలందించిన జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.

శివప్రతాప్ శుక్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యునిగా ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. ఫిబ్రవరి 2023 నుండి ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు.

జిష్ణు దేవ్ వర్మ బదిలీతో ఖాళీ అయిన ఈ స్థానంలో శుక్లా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లను కూడా కేంద్రం మార్పు చేసింది. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్.ఎన్. రవిని పశ్చిమ బెంగాల్‌కు బదిలీ చేయగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మాజీ దౌత్యవేత్త తరంజిత్ సింగ్ సంధు నియమితులయ్యారు.
రాజ్ భవన్‌లో త్వరలోనే నూతన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

#Sidhumaroju
Alwal