అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో ఆదివారం ఉదయం ఏక్తాన్ ర్యాలీ ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ ధీరజ్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు.
మిషన్ కాంపౌండ్ నుండి మొదలైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన సర్కిళ్ల మీదుగా పోలీస్ పెరేడ్ మైదానానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, పోలీసు అధికారులు, మహిళలు మరియు విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










