Home South Zone Andhra Pradesh రూ.10 లక్షల బకాయిలు… మహిళా దినోత్సవం రోజే కార్మికురాలి ఆవేదన

రూ.10 లక్షల బకాయిలు… మహిళా దినోత్సవం రోజే కార్మికురాలి ఆవేదన

0

కాకినాడ జిల్లా కరప పీహెచ్‌సీలో కంటింజెంట్ వర్కర్‌గా పనిచేస్తున్న ఎస్. దుర్గకు గత కొన్ని సంవత్సరాలుగా జీతాలు చెల్లించకపోవడం పట్ల మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. 2020 జనవరి నుంచి ఇప్పటివరకు ఆమెకు రావాల్సిన జీతాలు బకాయిగా ఉన్నాయని పేర్కొన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలో మహిళల సాధికారతపై వేడుకలు జరుగుతున్న సమయంలో, మరోవైపు దుర్గ మాత్రం తన జీత బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని మహిళా సంఘాలు తెలిపారు.

దుర్గకు సుమారు రూ.10 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) కూడా అంగీకరించినప్పటికీ ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బకాయి జీతాలను చెల్లించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. కార్మికురాలికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

NO COMMENTS

Exit mobile version