పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న మాతృత్వం కార్యక్రమం 100వ వారాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రేపు సుమారు 100 మంది గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా సీమంతాలు నిర్వహించి ఆశీర్వదించనున్నారు. తల్లి మరియు శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో గర్భిణీలకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వారికి ప్రత్యేక కానుకలు కూడా అందజేయనున్నారు. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం, వైద్య పరీక్షల ప్రాముఖ్యతపై వైద్యులు సూచనలు ఇవ్వనున్నారు.
మాతృత్వానికి గౌరవాన్ని చాటే ఈ కార్యక్రమం ద్వారా గర్భిణీలలో అవగాహన పెంపొందించడంతో పాటు తల్లి–శిశు ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
