మదనపల్లె బుద్ధునికొండపై విధించిన సెక్షన్ 163 నిషేధాజ్ఞలను తొలగించి, పూజలకు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి ‘బాస్’ వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సోమవారం వినతిపత్రం సమర్పించారు.
గత ఏడు నెలలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిలిచిపోవడంపై బౌద్ధుల ఆవేదనను సీఎంకు వివరించారు. బుద్ధవిహార అభివృద్ధికి 4.99 ఎకరాల భూమి కేటాయించాలని, 108 అడుగుల బుద్ధుని విగ్రహం, రోడ్డు, విద్యుత్ సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు.
