తిరుమలకు వెళుతున్న కారులో అలిపిరి వద్ద భారీగా నగదు స్వాధీనం.

0
0

తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా నగదు పట్టుబడటం చర్చనీయాంశమైంది. మంగళవారం ఉదయం విజిలెన్స్ సిబ్బంది జరిపిన సాధారణ తనిఖీల్లో ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 60 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

నాణేల మార్పిడి కోసమే ఈ నగదును తీసుకెళ్తున్నానని సదరు వ్యక్తి చెప్పినప్పటికీ, తగిన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నగదు ఎక్కడి నుండి వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తిరుమల కొండపైకి అనుమతి లేకుండా ఇంత భారీ మొత్తంలో నగదు తీసుకెళ్లడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.