హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్’ (MRDCL) భూసేకరణ ప్రక్రియలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది.
మూసీ పునరుద్ధరణ పనుల కోసం దాదాపు 3,279.19 ఎకరాల భూమిని సేకరించడంతో పాటు, సుమారు 10,017 ఇళ్లు లేదా కట్టడాలను సేకరించనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ (No. 215) విడుదల చేసింది.
డిసెంబర్ 16, 2025 నాటి G.O.Rt. No. 921 ప్రకారం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టుకు భూసేకరణ చట్టం (2013)లోని కొన్ని నిబంధనల నుండి మినహాయింపునిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల పరిధిలోని సుమారు 55 కిలోమీటర్ల మేర సాగే మూసీ పరివాహక ప్రాంతంలో ఈ భూసేకరణ జరగనుంది.
మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. 5,000 కోట్లతో కేవలం గాంధీ విగ్రహం కోసమే ఈ భూసేకరణ జరుగుతోందన్న వార్తలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టులో భాగంగా విగ్రహం, మ్యూజియం వంటి పనులకు దాదాపు ₹395 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని, మొత్తం ₹5,812 కోట్ల ప్రాజెక్ట్ వ్యయం కేవలం విగ్రహం కోసం కాదని అధికారులు స్పష్టం చేశారు.
భూమి కోల్పోయే వారికి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం లేదా ‘ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్’ (TDR) ద్వారా గరిష్టంగా 400% వరకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
అయితే, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (SIA) నుండి మినహాయింపు ఇవ్వడంపై పర్యావరణవేత్తలు మరియు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారీ స్థాయిలో ఇళ్ల సేకరణ జరగనుండటంతో బాధితులకు సరైన పునరావాసం కల్పించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
#sidhumaroju
Alwal









