చింతూరు న్యూస్ :-
జిల్లా చింతూరు మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాల మరియు కళాశాల నందు 6వ తరగతి మరియు ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ అయినట్లు పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపాల్ డి.రమాదేవి శుక్రవారం పత్రికా ప్రకటనలో తెలిపారు.
2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో 40 సీట్లకు అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరానికి గాను 40 సీట్లకు విద్యార్ధుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ప్రవేశాల దరఖాస్తులను మార్చి 12 నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు స్వీకరిస్తామని గనుక ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించాలని పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
# YADAGIRI










