Home South Zone Andhra Pradesh సీతారామస్వామి కోవెలలో మహాకుంభాభిషేక మహోత్సవాలు

సీతారామస్వామి కోవెలలో మహాకుంభాభిషేక మహోత్సవాలు

0

మంగళగిరి పాత పట్టణంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో ద్వితీయ పుష్కర ఉత్సవ ప్రయుక్త మహాకుంభాభిషేక మహోత్సవాలు మార్చి 12 నుండి 14 వరకు అత్యంత వైభవంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గణపతి పూజ, యాగశాల ప్రవేశం, హోమాలు మరియు కలశ స్థాపన శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ముగింపు రోజైన మార్చి 14న విమాన గోపురానికి పవిత్ర నదీ జలాలతో మహాకుంభాభిషేకం నిర్వహించగా, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, మంచినీటి సౌకర్యాలు కల్పించారు. ఈ పవిత్ర క్రతువుతో ఆలయానికి నూతన కవచం ఏర్పడిందని భక్తులు విశ్వసిస్తున్నారు.

NO COMMENTS

Exit mobile version