తనపై వస్తున్న ఆరోపణలపై జనసేన పార్టీ ఏపీఐఐసీ డైరెక్టర్ మై ఫోర్స్ మహేష్ ఆదివారం స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రజల మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో తనను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని, తాను ఎప్పుడూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నానని, తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదని, నిజాయితీగా సేవ చేస్తూ ముందుకు సాగుతానని మై ఫోర్స్ మహేష్ తెలిపారు.
