పుంగనూరు పట్టణంలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన విషవాయువు పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. శనివారం రాత్రి బైక్ను రిపేర్ చేయించిన తర్వాత, మెకానిక్ సూచన మేరకు గాలి ఆడని గదిలో స్టార్ట్ చేసి ఉంచడంతో, కార్బన్ మోనాక్సైడ్ గది నిండా వ్యాపించింది.
నిద్రలో ఉన్న నలుగురు ఆ విషవాయువును పీల్చి ఊపిరాడక ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.










