మతసామరస్యానికి ప్రతీకగా జనసేన ఇఫ్తార్ విందు.

0
1

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఆదివారం మదనపల్లెలో పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.

స్థానిక టిప్పు సుల్తాన్ మసీదు వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా, మానవత్వమే పరమావధిగా సాగడమే జనసేన లక్ష్యమని, పవిత్ర రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని, ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస దీక్షలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.