భీమన్న సేవలో రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

0
0

వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి, ధర్మపురి శాసనసభ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

​మంత్రి ఆలయానికి చేరుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ​

తర్వాత స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ జి. శ్రావణ్ కుమార్ మంత్రికి స్వామివారి శేష వస్త్రం, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ​ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య, వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్, ఎమ్మార్వో జయంత్, ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ, ఎడ్ల శివసాయి, జూనియర్ అసిస్టెంట్ సింహాచారి, జూనియర్ అసిస్టెంట్ నరాల రాజు, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు పాల్గొన్నారు.