చీరాల: చీరాల 17వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణ ఆధ్వర్యంలో తమ వార్డు ఎంతగానో అభివృద్ధి చెందిందని ప్రజలు కొనియాడారు.బాలకృష్ణ పదవీకాలం ముగియడంతో మంగళవారం ఆయనను వారు ఘనంగా సన్మానించారు.వార్డుకు ఆరోగ్య కేంద్రాన్ని తెప్పించడంతోపాటు,బాయ్స్ హైస్కూల్ ని,పార్క్ ని అభివృద్ధి చేశారని తెలిపారు.విద్యుత్ సమస్యలను పరిష్కరించారని,సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపేయించారని వారు తెలిపారు.ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలు పరిష్కరించారన్నారు.
తనకు కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం,నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ వెంకటేష్ బాబులకు,నమ్మకంతో గెలిపించిన ప్రజలకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.వారి సహకారంతోనే వార్డు అభివృద్ధి జరిగిందని ఆయన తెలిపారు.భవిష్యత్తులో కూడా తన సేవలు కొనసాగుతాయని బాలకృష్ణ వారికి హామీ ఇచ్చారు.
#Narendra
