హైదరాబాద్లో హైడ్రాకు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. బాగ్ అంబర్పేట్ ప్రాంతంలోని సుమారు 7 ఎకరాల భూమిలో “బతకమ్మ కుంట” పేరుతో హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ అంశంపై దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం, నెల రోజుల్లోగా సంబంధిత బోర్డులను పూర్తిగా తొలగించి, ఆ చర్యలపై సమగ్ర నివేదికను హైకోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
ఎడ్ల సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. భూమి స్వభావం, బోర్డుల ఏర్పాటు విధానం వంటి అంశాలపై వివరణ కోరిన హైకోర్టు, సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేసింది.
ఈ పరిణామం నగరంలో హైడ్రా చర్యలపై మరింత చర్చకు దారితీసే అవకాశముంది.
#sidhumaroju
Alwal
