మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో డ్రగ్ స్టోర్‌పై ఆకస్మిక తనిఖీ.

0
0

మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ రాధిక బుధవారం డ్రగ్ స్టోర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న, కొరతలో ఉన్న మందుల వివరాలను రికార్డులను పరిశీలించి తెలుసుకున్నారు.

రోగులకు మందుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత ఫార్మసీ సిబ్బందిపై ఉందని, అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.