హైదరాబాద్: బోయినపల్లి మార్కెట్లో కనీస సదుపాయాలు కరువయ్యాయంటూ స్థానిక ప్రజలు, నాయకులు చేపట్టిన ఆందోళనలకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ పూర్తి మద్దతు ప్రకటించారు.
శనివారం మార్కెట్ సందర్శించిన ఆయన, స్థానికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. మార్కెట్లో పేరుకుపోయిన చెత్తను తొలగించకపోవడం, వినియోగదారులకు కనీస టాయిలెట్ సౌకర్యం లేకపోవడంపై అధికారుల తీరును తప్పుబట్టారు.
మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు.
ప్రజల ప్రాథమిక అవసరాలను విస్మరిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ నిరసనలో బిజెపి సీనియర్ నేత చింతల మాణిక్య రెడ్డి, స్థానిక బీజేపీ నేతలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










