*దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు*
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 7.2 కోట్ల అనర్హుల పేర్లను తొలగించారు. ఇందులో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఓటర్లు నివాసం మారడం, మరణించడం, డూప్లికేట్ పేర్లు వంటి కారణాలతో ఈ తొలగింపులు జరిగాయి. ఈ ప్రక్రియలో 2 కోట్ల మంది కొత్త ఓటర్లను కూడా చేర్చారు. దీంతో మొత్తం ఓటర్ల సంఖ్య 45.8 కోట్లకు చేరింది. అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యధికంగా 16.6% ఓట్లు తొలగించబడ్డాయి.









