“మల్కాజ్‌గిరి సమస్యలపై యాక్షన్ మోడ్‌లో ఎమ్మెల్యే… కలెక్టర్‌తో కీలక భేటీ”

0
13

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ మాను చౌదరి (IAS)ను కలిసి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రాలు సమర్పించారు.

22-A ఆస్తుల పునఃసమీక్ష, ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు, UPHC నిర్మాణం, అక్రమ ఆక్రమణల నివారణ, కమ్యూనిటీ హాళ్ల పూర్తి, SC స్కీమ్ పారదర్శక అమలు వంటి అంశాలు ప్రస్తావించారు.

18 బీపీఎల్ కుటుంబాలకు 2BHK ఇళ్లు, రోడ్ల అభివృద్ధి, ప్రజా భూముల రక్షణపై కూడా దృష్టి సారించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, “మల్కాజ్‌గిరి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. పెరుగుతున్న జనాభాకు మల్కాజ్‌గిరి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను అత్యవసరంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రజల సమస్యల పరిష్కారం ఆలస్యం కాకుండా జిల్లా యంత్రాంగం సమన్వయంతో వెంటనే చర్యలు తీసుకోవాలి” అని స్పష్టం చేశారు.

కలెక్టర్ అన్ని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal