హజ్ యాత్రికులకు ఘనంగా వీడ్కోలు
హజ్ కమిటీ ఛైర్మన్ కృతజ్ఞతా పూర్వక అభినందనలు
ప్రతి హజ్ యాత్రికుడికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం.
నందిగామ ఎన్టీఆర్ జిల్లా
విమానాశ్రయం నుండి పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరిన యాత్రికులకు వీడ్కోలు పలికే కార్యక్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగాఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఛైర్మన్ జనాబ్ హాజీ షేక్ హసన్ బాషా తన హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేశారు. హసన్ భాష యాత్రికలకు సకల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. యాత్రికులు హసన్ భాషకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు..ప్రభుత్వ సహకారం: హజ్ యాత్రికులకు గన్నవరం విమానాశ్రయం వద్ద ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడంలో నిరంతరం మార్గనిర్దేశం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి.
మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారుఈ కార్యక్రమంలో పాల్గొని యాత్రికులను మైనారిటీ సంక్షేమ సలహాదారులు జనాబ్ ఎంఏ షరీఫ్ కి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జనాబ్ ఎన్ ఎండి ఫరూక్ కి, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జనాబ్ షేక్ షిబ్లికి,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలిపారు.సమిష్టి కృషి కార్యక్రమ విజయానికి సహకరించిన గుంటూరు ఎమ్మెల్యేలు, ఎంపీల మైనారిటీ నాయకులకు, వాలంటీర్లకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా, ప్రతి హజ్ యాత్రికుడికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే మా లక్ష్యం. ఈ పవిత్ర కార్యంలో భాగస్వాములై సహకరించిన ప్రతి ఒక్కరికీ అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.










