కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తే కథేమిటో అర్థమవుతుంది: టీ పీసీసీ చీఫ్

0
2

హైదరాబాద్: కేసీఆర్ అనే పులి ఫాం హౌస్‌కే పరిమితమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.

‎పులి తిన్న ఆవుల గురించి బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు.

‎పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తేనే జీవన్ రెడ్డికి ఆయన కథేమిటనేది అర్థమవుతుందన్నారు.

‎జీవన్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసినప్పుడు కనిపించ లేదా? అని ఆయన్ని సూటిగా ప్రశ్నించారు.

‎‎సీఎం రేవంత్ రెడ్డి సభకు పోటీగా కేసీఆర్ సభ పెట్టారని ఆరోపించారు.

‎రేవంత్ సభ 20 రోజుల ముందే ఫిక్స్ అయిందని గుర్తు చేశారు.

‎కేసీఆర్‌కి మాది కౌంటర్ ప్రోగ్రాం కాదని కుండబద్దలు కొట్టారు.

‎ఆశల పల్లకిలో ఊరేగించడం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కి అలవాటేనంటూ వ్యంగ్యంగా అన్నారు.

‎జీవన్ రెడ్డికి కేసీఆర్ ఏం ఆశలు చూపించారో అంటూ ఎద్దేవా చేశారు.

‎మేడిగడ్డలో కేసీఆర్ చేసిన మోసాలపై జీవన్ రెడ్డే తమకు పాఠాలు చెప్పారని ఈ సందర్భంగా టీ పీసీసీ చీఫ్ గుర్తు చేసుకున్నారు.

‎అలాంటి జీవన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి కోరస్ ఇస్తున్నాడని విమర్శించారు.

‎గతంలో కేకే, డీఎస్ లాగే జీవన్ రెడ్డి కూడా బాధపడుతారని చెప్పారు.

‎రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని స్పష్టం చేశారు.

‎రేవంత్ పోవాలి మార్పు రావాలి అనే హక్కు ఎక్కడిది?

‎జీవన్ రెడ్డికి అంటూ ఆయనపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు.