ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అలిమ్కో సంస్థ వారి ఆధ్వర్యంలో చిలుకూరు మండల సమగ్ర శిక్ష ఉపాధ్యాయ బృందం వారి సహకారంతో గత ఆరు నెలల క్రితం నిర్వహించిన క్యాంపులో చిలుకూరు మండలం నుండి 15 మంది శారీరక వికలాంగత్వం కలిగినటువంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఉపకారణాల కొరకు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగా అలిమ్కో సంస్థ పంపించినటువంటి 6 గురికి వీల్ చైర్ లు, 3 రోలెటర్ లు, 3 హియరింగ్ ఎయిడ్ లు,3 మస్జిద్ కిట్ ల ను శనివారం మండల విద్యాధికారి గుజ్జుల నర్సిరెడ్డి, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ- నాగయ్య చేతులు మీదుగా పిల్లలకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ,చిలుకూరు ఎమ్ పి పి ఎస్ ఉపాధ్యాయులు శ్రీను, రామారావు, ఐ ఇ ఆర్ పి సుమలత,పద్మ ఎమ్ ఆర్ సి సిబ్బంది పిల్లల తల్లితండ్రులు పాల్గొన్నారు.







