రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు పులిచెర్ల మండలం , పాతపేట పంచాయతీకి చెందిన లక్ష్మయ్య సొంతపని నిమిత్తం బైకుపై పీలేరు వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ కల్లూరు హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంలో ఉన్న లక్ష్మయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.










